కలం, వెబ్ డెస్క్: అటవీ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లు పట్టుబడ్డాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద అటవీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ బొలెరో వాహనంలో తాబేళ్లను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 12 బస్తాల్లో కుక్కి ఉన్న 263 తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవాణాలో తలెత్తిన ఇబ్బందుల వల్ల బస్తాల్లో ఉన్న వారిలో 20 తాబేళ్లు (Turtles) అప్పటికే మృతిచెందాయి. అధికారులను చూడగానే నిందితులు తమ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను పోలీసులు చెరువులో వదలిపెట్టారు.

