కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండల పరిధిలోని పాలవాగు బ్రిడ్జి సమీపంలో గురువారం రాత్రి రెండు బైక్లు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న యువకుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పాల్వంచ నెహ్రూ నగర్కు చెందిన తుంపూరి కళ్యాణ్గా గుర్తించారు.
నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న ములకలపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: బీజింగ్లో ట్రంప్ సెన్సేషన్: చైనాతో భారీ ఒప్పందాలు!
Follow Us On: Sharechat

