కలం, కరీంనగర్ : యూత్ కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని, త్వరలో చేపట్టే నామినేట్ పోస్టుల్లో అవకాశం కప్పిస్తామని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జీ రోషిణి జైశ్వాల్ (Roshini Jaiswal) అన్నారు. కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ముత్యం శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోషిణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞ, థామస్, కరీంనగర్ జిల్లా ఇంచార్జి తేజస్విని, జోసెఫ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు, అసెంబ్లీ అధ్యక్షుడు అట్లా అనిల్, కృప సాగర్, నగర అధ్యక్షుడు విశాల్, వివిధ కమిటీ బాధ్యులు ఫహద్, తల్లపెల్లి శ్రీకాంత్, తోర్తి అరవింద్, జక్కుల అఖిలేష్, బుర్ర రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

