కలం, జనగామ: జనగామ జిల్లాలోని చిల్పూర్ (Chilpur) మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఆదివారం గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

