కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో తలపై బాది చంపేశారు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడిని స్థానిక స్టీల్ పరిశ్రమలో పని చేసే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దేవ హెమ్రాన్గా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగిన పోలీసులు హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజం గౌడ్, ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Read Also: కొరత లేదంటూనే.. కోతలు, వాతలు
Follow Us On: Instagram

