కలం, నల్లగొండ బ్యూరో: సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy) ఆలయాన్ని మూసివేయనున్నట్టు ఆలయ ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. ఉదయం 7 గంటల నుండి బుధవారం ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహారార్థం ఆలయ అర్చకులు సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేయనున్నారు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్య పూజలు నిర్వహించి భక్తులను స్వామి వారి దర్శనాలకు ఆలయ అధికారులు అనుమతించనున్నారు. భక్తులు గమనించి సహకరించాలని కోెరారు.

