కలం, వెబ్ డెస్క్: జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ఫినో బ్యాంక్ (Fino Bank) సీఈవో రిషి గుప్తాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అరెస్ట్ (DGGI) చేసింది. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో రిషి గుప్తా జీఎస్టీ ఎగ్గొట్టినట్లు డీజీజీఐ వెల్లడించింది. ఈ గేమింగ్ నిర్వహణలో రూ.13 కోట్ల సిండికేట్ జరిగినట్లు గుర్తించారు. వీటిలో ఎక్కువగా ఫినో బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిపినట్లు వెల్లడించారు. ఈ రకంగా రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు స్పష్టం చేశారు. రిషి గుప్తా(Rishi Gupta)ను కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

