అక్రమాస్తుల కేసు.. జైలుకు జలమండలి జీఎం

కలం, వెబ్ డెస్క్: జలమండలి జీఎం (Water Board GM) అనంత లక్ష్మీ కుమార్‌ నివాసంలో ఏసీబీ రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి దాదాపు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. పరిశీలించిన జడ్జి నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో, బినామీల ఇళ్ల నుంచి రూ.1.10 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు వెలుగుచూశాయి. అలాగే పలు ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>