కలం, వెబ్ డెస్క్: జలమండలి జీఎం (Water Board GM) అనంత లక్ష్మీ కుమార్ నివాసంలో ఏసీబీ రైడ్స్ చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి దాదాపు రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. పరిశీలించిన జడ్జి నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో, బినామీల ఇళ్ల నుంచి రూ.1.10 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు వెలుగుచూశాయి. అలాగే పలు ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, వ్యవసాయ భూములకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.

