కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (Hash Oil) స్మగ్లింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ (Sunpreet Singh) తెలిపిన వివరాల ప్రకారం.. హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఈ ముఠా నుండి సుమారు రూ.2 కోట్ల 50 లక్షల విలువ గల హాష్ ఆయిల్తో పాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
Read Also: లాడ్జిలో గది అద్దెకు తీసుకుని.. చివరకు!
Follow Us On: Instagram

