కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కౌంటింగ్ ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో (Huzurabad) కౌంటింగ్కు అంతరాయం కలిగింది. అధికారులు స్ట్రాంగ్ రూం తాళం చెవి పోగొట్టడమే దీనికి కారణమైంది. దీంతో అధికారులు చేసేదేం లేక గడ్డపారతో తాళం పగులగొట్టారు. ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన విషయంలో ఇంతటి నిర్లక్ష్యం ఏమిటని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి హుజూరాబాద్లో కొంత ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది.
Read Also: ‘సృష్టి’ కేసులో నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ
Follow Us On: Instagram


