విశాఖలో లారీ బీభత్సం: ఇద్దరు దుర్మరణం

కలం, వెబ్​ డెస్క్​ : విశాఖపట్నం (Visakhapatnam)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బిహెచ్‌పివి (BHPV) జంక్షన్ వద్ద అతివేగంగా వచ్చిన ఒక లారీ నియంత్రణ కోల్పోయి, అక్కడ ఆగి ఉన్న వాహనాలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ భీకర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ ధాటికి ఒక కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

మృతుల్లో ఒకరిని రామకృష్ణగా గుర్తించారు. ఆయన తన కుమార్తెతో కలిసి సింహాచలం దర్శనానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మరో మృతుడిని సతీష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>