కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి శనిగరం విజయ కన్నుమూశారు. ఈ సందర్బంగా హైదారాబాద్ కొండాపూర్ లోని వారి నివాసంలో ఆమె పార్థివ దేహానికి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) నివాళులు అర్పించారు. సంతోష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రశాంత్ రెడ్డి వెంట రాజారామ్ యాదవ్ ఉన్నారు.

