Mobile Popup Ad
Mobile Popup Ad

ఎగ్జిబిటర్స్‌తో నేడు చిరంజీవి కీలక భేటీ

కలం, సినిమా : టాలీవుడ్‌లో కొనసాగుతున్న ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం (Percentage Dispute) పరిష్కార దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నేడు తెలంగాణ ఎగ్జిబిటర్స్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై ప్రధానంగా చర్చ జరగనుంది.

ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ సమస్యలను స్వయంగా వినేందుకు చిరంజీవి సమయం కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండస్ట్రీలో నెలకొన్న ఈ వివాదానికి చిరంజీవి జోక్యంతో పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశం అనంతరం పర్సంటేజ్ విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>