కలం, వెబ్ డెస్క్ : భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేశ్ బాబు (Vaishali Ramesh Babu) చరిత్ర సృష్టించారు. సెప్రస్ లో జరిగిన ప్రతిష్ఠాత్మక పిడే చెస్ మహిళల టైటిల్ లో విజయం సాధించారు. ఈ చెన్నై స్టార్ భారత్ తరఫున ఫిడే ఛాంపియన్ షిప్ గెలిచి మొదటి మహిళగా రికార్డులకెక్కారు. ఉక్రేనియన్ – రష్యన్ గ్రాండ్ మాస్టర్ కేటెరీనా లాగ్నోపై గెలిచి అరుదైన ఘనత సాధించారు. దీంతో ఐదు సార్లు మహిళల వరల్డ్ ఛాంపియన్ జూ వెన్ జున్తో వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ కోసం పోటీ పడేందుకు వైశాలి (Vaishali Ramesh Babu) అర్హత సాధించింది.
ఈ సంవత్సరం చివర్లో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ వేదిక, తేదీలను ఫిడే ఖరారు చేయాల్సి ఉంది. బుధవారం జరిగిన గేమ్ లో క్యాండిడేట్స్ టోర్నీలో ఆఖరిదైన 14వ రౌండ్ లో 48 ఎత్తుల్లో కాటరినా లక్నో (రష్యా)ను వైశాలీ ఓడించి అరుదైన ఘనత సాధించింది. ఈ టోర్నమెంట్ లో అతి తక్కువ రేటింగ్ ఉన్న ఆమె.. అద్భుతమైన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకోవడం విశేషం. ఈ విజయం భారత దేశ చెస్ రంగంలో మరో మైలురాయిగా నిలిచింది. కాగా, వైశాలి రమేశ్ బాబు గ్రాండ్ మాస్టర్ ప్రగ్నానందా సోదరి కావడం విశేషం.

