కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలోని కేంద్ర కేబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం తీసుకున్న ఈ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కొత్తగా రూ. 33,660 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ (Industrial Parks) ఏర్పాటు చేయడమే ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో భవ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. 2023-24 ఏడాదికి గాను పత్తి సీజన్ ఎమ్ఎస్పీ (MSP) రీయింబర్స్ మెంట్ కి రూ.11,712 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారి-92 (NH-92) బారాబంకి నుండి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల నిర్మాణానికి రూ. 6,969 కోట్లు కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి రూ.2,585 కోట్లు కేటాయించింది.

