కలం, తెలంగాణ బ్యూరో: ఇంటిని, ఇంటి లెక్కలను చక్కదిద్దే ఆడబిడ్డకు దేశం లెక్కలను సెట్ చేయడం కష్టమేమీ కాదని నిరూపించారు ఇందిరాగాంధీ (Indira Gandhi). అటు తొలి మహిళా ప్రధానమంత్రిగా కొనసాగుతూనే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చూస్తూ 1970 ఫిబ్రవరి 28న ఆమె బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టారు. ఇలా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కూడా ఇందిరమ్మ రికార్డులకెక్కారు. అనంతరం రెండో మహిళగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నిలిచారు.
– ప్రధానమంత్రులుగా ఉంటూనే బడ్జెట్ ప్రవేశపెట్టింది ముగ్గురే. వాళ్లు జవహర్ లాల్ నెహ్రూ (1958), ఆ తర్వాత ఆయన బిడ్డ ఇందిరాగాంధీ (1970), అనంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ (1987).
Read Also: కేంద్ర బడ్జెట్ : ఆసక్తికర విశేషాలు
Follow Us On: X(Twitter)


