లైవ్​ స్ట్రీమింగ్​లో యాక్సిడెంట్​.. ఐసీయూలో యూట్యూబర్​

కలం, వెబ్​ డెస్క్​: లైవ్​ స్ట్రీమింగ్​లో 80వేల మందికి పైగా చూస్తుండగా జరిగిన యాక్సిడెంట్​లో ఓ యూట్యూబర్(Anurag Dobhal)​ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు, కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనురాగ్​ దోభాల్​.. బైక్​ రైడింగ్​ ద్వారా వివిధ ప్రదేశాలు తిరుగుతూ, ఆ వీడియోలను యూట్యూబ్​లో పోస్ట్​ చేసేవాడు. యూకే 07 రైడర్​ పేరుతో ఉండే అతని అకౌంట్​కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే అతను హిందీ బిగ్​బాస్​ 17కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో శనివారం అనురాగ్​ తన ఫార్చూనర్​ కారులో వెళుతూ ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో లైవ్​ స్ట్రీమింగ్​ ఆన్​ చేశాడు. ఇదే లాస్ట్​ డ్రైవింగ్​ అని చెబతూ, వేగంగా వెళ్లి డివైడర్​ను ఢీకొట్టాడు. ఈ ఘటన గజియాబాద్​లోని మసూరి ఏరియాలో ఢిల్లీ–మీరట్​ ఎక్స్​ప్రెస్​ హైవేపై జరిగింది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనురాగ్​ను(Anurag Dobhal) పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాగా, కుటుంబసభ్యులతో విభేదాల వల్ల అనురాగ్​ ఆత్మహత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. లైవ్​ స్ట్రీమింగ్​లో డ్రైవింగ్​ చేస్తూ ఇదే ‘ఫైనల్​ డ్రైవ్​’ అని చెప్పడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దీనికి తోడు కుటుంబ సభ్యుల కారణంగా తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అంతకుముందు అనురాగ్​ వీడియోల్లో చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను అనురాగ్​ మేనేజర్​ కొట్టేశారు. ఊహాగానాలు వద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, అనురాగ్​ కుటుంబ సభ్యులు తమ తప్పేమీ లేదని, అనురాగ్​ మాటలు విని ఒకవైపు నమ్ముతున్నారని అంటున్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా బైక్​ రైడింగ్​తో విపరీతమైన ఫాలోయింగ్​ పెంచుకున్న అనురాగ్​ ఇలాంటి చర్యకు పాల్పడడం అతని అభిమానులను షాక్​కు గురిచేసింది.

Read Also: విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>