గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు

కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మిపురం వద్ద గల గోదావరిలో ఇద్దరు గల్లంతైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం…సంపత్, నరేష్, పండు అనే ముగ్గురు గోదావరిలోకి ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. అయితే సంపత్ చాకచక్యంగా ఒడ్డుకు చేరాడు. మిగతా ఇద్దరి ఆచూకీ లభించలేదు. సమాచారం మేరకు పోలీసులు గజ ఈత గాళ్ళ సాయంతో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>