కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం-ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటోలోని ఇద్దరు ప్రయాణికులు స్పాట్ లోనే మృతి చెందారు. మృతులు అంగన్వాడి టీచర్ కమల (40), బనోత్ అంబయా నాయక్ (55)గా గుర్తించారు పోలీసులు. ఆటోలోని మరో నలుగురికి తీవ్ర గాయాలు అవడంతో.. ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: దేశానికి గాంధీ జాతిపిత.. రాష్ట్రానికి కేసీఆర్ : హరీశ్ రావు
Follow Us On : WhatsApp


