కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా లింగాల ఘనాపురం మండలం నవాబ్ పేట చౌరస్తాలో గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు గాయపడిన వారిని జనగామ ఆస్పత్రికి తరలించారు. మృతులు హనుమకొండకు చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

