పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజ‌య్ నామినేష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్ (Perambur), తిరుచ్చి ఈస్ట్ (Trichy East) నియోజ‌క‌వర్గాల నుంచి టీవీకే అధినేత విజయ్ (TVK chief Vijay) నామినేషన్ దాఖ‌లు చేశారు. ఆదివారం రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన విజ‌య్ తాను రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు నేడు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఏప్రిల్ 23న తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. పెరంబూర్ చెన్నైలో అత్యంత కీల‌కమై, పెద్ద నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా ఉంది. పెరంబూర్‌లో 2.20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పెరంబూర్‌ను విజయ్ ఎంచుకోవడం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>