అదొక్కటే మార్గం.. ఇరాన్​కు ట్రంప్ వార్నింగ్​

కలం, వెబ్​ డెస్క్​: ఇరాన్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మరోసారి వార్నింగ్(Trump Warns)​ ఇచ్చారు. ఆ దేశం బేషరతుగా లొంగిపోవాల్సిందేనన్నారు. ఎలాంటి చర్చలకూ అవకాశం లేదన్నారు. సరెండర్​ మినహా మరే ఒప్పందం కుదరదన్నారు. ఈ మేరకు శుక్రవారం సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ట్రూత్​లో ట్రంప్​ పోస్ట్ చేశారు.

ఇరాన్​కు ఇక అవకాశం లేదని, లొంగిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఇరాన్​ అభివృద్ధి కోసం ఆలోచిస్తామన్నారు. ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్​కు మంచి భవిష్యత్తు ఇస్తామని, ఆర్థికంగా మెరుగైన, మరింత బలమైన స్థితికి తీసుకొస్తామని చెప్పారు(Trump Warns). మరోవైపు ఇరాన్​ అధ్యక్షుడు పెజెష్కియన్​ మాత్రం అమెరికాతో సంధికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆ దిశగా కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. అయితే, వాటి వివరాలు ఆయన బయటపెట్టలేదు.

తెహ్రాన్​, బాగ్దాద్​లో బాంబుల వర్షం..

పశ్చిమాసియా యుద్ధం ఏడోరోజూ ఇజ్రాయెల్​ భీకర దాడులు చేసింది. ఇరాన్​ రాజధాని బాగ్దాద్​, మరో రెండు ప్రధాన నగరాలు ఇస్ఫహాన్​, మషాద్​లతోపాటు లెబనాన్​ రాజధాని బీరుట్​పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్​.. ఇజ్రాయెల్​ రాజధాని టెల్​ అవీవ్​, జెరూసలేంపై క్లస్టర్​ బాంబులు వదిలింది. అలాగే ఖతార్​, యూఏఈ పైనా డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్​ దాడికి దిగింది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు ఇరాన్​లో 1200 మందికి పైగా మరణించినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>