కలం, డెస్క్ : తెలంగాణలో మావోయిస్టుల (Maoist Party) శకం ముగిసిందని పోలీసులు చెబుతున్నారు. రేపు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట తెలంగాణ మావోయిస్టు కేడర్ కు చెందిన అగ్ర నేతలు లొంగిపోనున్నారు. దేవోజీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డితో పాటు మొత్తం 16 మంది లొంగిపోనున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్టు పోలీసులకు చెబుతున్నారు. వీరి లొంగుబాటుతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారినట్టు రేపు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించబోతున్నారు.


