కలం, వెబ్ డెస్క్: ములుగు జిల్లాలోని మేడారం జాతర(Medaram Jatara)లో నేడు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పూజారులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించనున్నారు. ప్రతిసారి జాతర ముగిసిన వారం రోజుల తర్వాత ఈ పండుగ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా జరిగింది. కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతర ముగిసినా ఇప్పటికీ మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.


