కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణలో ఆర్టీసీ (TGSRTC) సమ్మెలో కార్మికుల వరుస ఆత్మహత్యాయత్నాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా తాజాగా హనుమకొండ (Hanumakonda) జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పరకాలకు చెందిన రవీందర్ భూపాలపల్లి డిపోలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు రవీందర్ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

