కలం, వెబ్ డెస్క్: వాహనదారులకు హైకోర్టు (TG High Court) గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లు ఉన్నా ఆ వాహనాలను సీజ్ చేయొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల కారణంగా వాహనాలను సీజ్ చేయొద్దని.. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదు. దీంతో ఓ బాధితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు (TG High Court).. హోం సెక్రటరీ, డీజీపీ, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), అలాగే ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ పరిణామం వాహనదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. పెండింగ్ చలాన్లు ఉన్నప్పటికీ, వెంటనే వాహనాలను సీజ్ చేయకుండా చట్టపరమైన ప్రక్రియను పాటించాలని కోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
Read Also: జాగృతి టు రక్షణ సేన… కవిత ట్విస్టుల మీద ట్విస్టులు
Follow Us On: Instagram

