Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి : కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

కలం, వరంగల్ బ్యూరో : విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మార్చి 2026లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలోని 17 ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టాపర్ విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ విజయం జీవిత ప్రయాణంలో మొదటి మెట్టు మాత్రమేనని, తమ అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా భవిష్యత్తు కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా, స్వయంగా తమ లక్ష్యాలను నిర్ణయించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని కలెక్టర్ (Collector Chahat Bajpai) అన్నారు. అదే పట్టుదల, కృషిని ఇంటర్మీడియట్ చదువులో కూడా కొనసాగిస్తే మరింత ఉన్నత విజయాలు సాధించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలిచేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, ఏఎంఓ డా. బండారు మన్మోహన్, ఇతర అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read Also: యూపీఐకి పదేళ్లు.. చెల్లింపుల్లో గొప్ప విప్లవం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>