కలం, వెబ్ డెస్క్ : కడప నగరంలోని అల్మాస్ పేట కూడలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్మాస్ పేట సర్కిల్ (Almaspet Circle) వద్ద హనుమాన్ సర్కిల్ అని రాసి ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేయడంపై వివాదం రాజుకుంది. ఈ విషయంపై ఒక వర్గం నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపైకి కూడా రాళ్లు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో రాళ్లు తగిలి ఒక ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

