బోడమాణిక్యం తండాలో ఉద్రిక్తత..!

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండా (Bodamanikyam Thanda)లో తీవ్ర ఉద్రిక్తత‌ నెల‌కొంది. హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో స్రవంతి అనే మ‌హిళ‌ ఇద్దరు పిల్లలకు ఉరేసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భ‌ర్త గ్రామ‌మైన బోడ‌మాణిక్యం తండాలో నిన్నటి నుంచి ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి తరఫు బంధువులు ఆందోళన చేస్తూ భర్త ప్రవీణ్ ఇంటి ఆవరణలోనే స్ర‌వంతి, పిల్ల‌ల‌ మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు గోతులు తవ్వారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>