కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) లో సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో కాంగ్రెస్ నేతకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కోటూరి మానవతా రాయ్ కి సిట్ గురువారం నోటీసులు జారీచేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా శుక్రవారం ఉదయం 11గంటలకు బషీర్ బాగ్ లోని పాత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

