కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని తెలంగాణ డీజీపీ సీవీ. ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన డీజీపీగా నియామకం అయిన సందర్భంగా బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కలిసిన సీవీ. ఆనంద్ కు సీఎం అభినందనలు తెలియజేశారు.
కాగా, డీజీపీగా సీవీ ఆనంద్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సీవీ.ఆనంద్ కు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి స్థానంలో ప్రమోషన్ లభించింది. రెండేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగనున్న సీవీ. ఆనంద్ మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.

