కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఐఏఎస్ అధికారుల (IAS officers) బదిలీల్లో తాజాగా కీలక సవరణ జరిగింది. 25 ఫిబ్రవరిన విడుదల చేసిన జీవోలో ఐటీ శాఖ బాధ్యతలను సీనియర్ అధికారి ఎన్. శ్రీధర్కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నేడు మరో కొత్త జీవో జారీ చేస్తూ ఆ ఆదేశాలను సవరించింది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఐటీ (IT) ఇండస్ట్రీస్ శాఖల అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు అప్పగించింది. ఐఏఎస్ బదిలీల్లో ప్రభుత్వం కీలక సవరణ చేయడంతో అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

