కలం, వెబ్డెస్క్: డీలర్ దుకాణాల వద్ద రద్దీని అరికట్టేలా, రైతులకు సకాలంలో ఎరువులు అందేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఎరువుల యాప్ (Fertiliser App) కు క్రమేపీ ఆదరణ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ల సమస్యతో మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం అవగాహన పెరగడంతో దానికి తగినట్లుగానే బుకింగ్స్లో పెరుగుదల కనిపించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు ఎరువుల యాప్ల ద్వారా బుకింగ్స్ తదితర వాటి గురించి వెల్లడించింది. దీని ప్రకారం.. శనివారం(ఫిబ్రవరి 14) నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ ద్వారా 12.73లక్షల మంది రైతులు ఎరువుల యాప్ను వినియోగించి, 50.48లక్షల యూరియా సంచులు బుక్ చేసుకున్నారు.
ఇందులో 46.13 లక్షల సంచులను ఇప్పటికే రైతులు కొనుగోలు చేశారు. ఫర్టిలైజర్స్ యాప్ డౌన్లోడ్స్, బుకింగ్స్, కొనుగోలులో నల్లగొండ జిల్లా టాప్లో ఉంది. ఇక్కడ ఎరువుల యాప్ ద్వారా మొత్తం 1,66,704 మంది రైతులు 7,58,949 సంచులు బుక్ చేసుకున్నారు. ఇందులో 7,45,183 సంచులు కొనుగోలు చేశారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక్కడ 1,977 రైతులు 9,491 సంచులు బుక్ చేసుకున్నారు. 6,314 సంచులు కొనుగోలు చేశారు.
Fertiliser App ఎరువుల బుకింగ్స్, కొనుగోలులో టాప్ 5 జిల్లాలు ఇవీ
జిల్లా రైతులు బుక్ చేసిన సంచులు కొనుగోలు చేసిన సంచులు
నల్లగొండ 1,66,704 7,58,949 7,45,183
జగిత్యాల 1,38,469 5,08,884 5,08,884
పెద్దపల్లి 91,935 3,84,589 3,80,707
సూర్యాపేట 80,654 3,07,761 2,77,901
ఖమ్మం 70,785 3,18,931 2,85,270
మిగిలిన జిల్లాల వివరాల కోసం కింది ఇమేజ్ పై క్లిక్ చేయండి..
Read Also: కమిషన్లు, సీబీఐ, ఈడీ… అయినా సస్పెన్స్!
Follow Us On: X(Twitter)


