కలం, వెబ్ డెస్ : త్వరలో టీవీకే (TVK) పార్టీ విశ్వరూపం చూపిస్తాం అని తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత దళపతి విజయ్ (CM Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కరూర్ లో పర్యటించిన ఆయన కరూర్ తొక్కిసలాట బాధితులను పరామర్శించారు. సీఎం హోదాలో తొలిసారి కరూర్ లో పర్యటించారు. ఈ సందర్బంగా టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను విజయ్ అందజేశారు.
ఈ సందర్బంగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్ టీవీకే సభలో తొక్కిసలాట జరుగుందని ప్రభుత్వానికి ముందే తెలుసని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా తమను కరూర్ పోలీసులు అప్రమత్తం చేయలేదని సీఎం (CM Vijay) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో అతిపెద్ద విషాదం కరూర్ తొక్కిసలాట అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరూర్ ఘటనలో (Karur Stampede) రాజకీయ కుట్ర కోణం ఉందని విజయ్ ఆరోపించారు. అవినీతి చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అలాగే, డీలిమిటేషన్ పై స్పందించిన సీఎం విజయ్.. ఈ ప్రక్రియకు తాము వ్యతిరేకం అని స్పష్టం చేశారు. కాగా, గత ఏడాది (2025 సెప్టెంబర్లో టీవీకే (TVK) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
Read Also: నాకు తెలంగాణ ఫస్ట్.. తరువాతే పార్టీ : ఈటల కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

