epaper
Sunday, March 1, 2026
epaper

టీమిండియా కెప్టెన్సీపై ఇంగ్లండ్ మాజీ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు!

కలం, వెబ్​ డెస్క్​: టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్సీపై తీవ్రస్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌ నాయకత్వంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య కెప్టెన్సీ అద్భుతంగా ఉందన్నాడు. టోర్నీ తర్వాత కూడా టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్​ను కొనసాగించాలని సూచించాడు. సూర్య నాయకత్వంలో టీమిండియా టీ20ల్లో మంచి ప్రదర్శన చేస్తోంది.

2021లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతను అంతర్జాతీయ టీ20ల్లో తన స్థిరమైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత సూర్యకుమార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అతని నాయకత్వంలో భారత్ 49 మ్యాచ్‌లలో 36 విజయాలు సాధించింది. దీంతో జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సూర్య వయసు 35 సంవత్సరాలు కావడంతో భవిష్యత్ ప్రణాళికలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీ20 వరల్డ్‌కప్ తర్వాత సూర్యకుమార్‌ను పక్కన పెట్టడం సరైంది కాదని వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతను సూర్యను ప్రతిభావంతుడైన ఆటగాడిగా అభివర్ణించాడు.

ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ తర్వాత జట్టు కూర్పుపై కూడా చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తాయి. అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 107 పరుగులు చేసినప్పటికీ స్ట్రైక్‌రేట్ 118.88గా ఉంది. ఈ నేపథ్యంలో మైఖేల్ వాన్ (Michael Vaughan) అభిప్రాయం ప్రకారం జట్టులో విభిన్న శైలిలో ఆడే ఆటగాళ్లు అవసరమని, స్థిరంగా ఆడే ఆటగాళ్ల స్ట్రైక్‌రేట్ కొన్నిసార్లు తక్కువగా ఉండవచ్చని సూచించినట్లు తెలిపారు. మొత్తంగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టు కెప్టెన్సీపై నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. రాబోయే మ్యాచ్‌లు ఆటగాళ్ల ప్రదర్శనపై మరింత స్పష్టత ఇవ్వనున్నాయి.

Read Also : పాకిస్థాన్​ సెమీస్ ఆశలు సజీవమేనా? సమీకరణాలివే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!