కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు (Meenakshi Natarajan) సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం విచారించి, దానిని కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ సమస్యపై ఆమెకు ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించవచ్చని లేదా ఎన్నికల సంఘానికి విన్నవించుకోవచ్చని న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేస్తూ పిటిషన్ను తిరస్కరించింది.

