కలం, డెస్క్ : హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో (Kakatiya University) స్టూడెంట్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. తోటి స్టూడెంట్లు చెబుతున్న దాని ప్రకారం.. ఆదివారం(నిన్న) స్టూడెంట్లందరూ తినగా మిగిలిన చికెన్ ను పంచుకోవడంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా పర్సనల్ గా తిట్టుకోవడం దాకా వెళ్లింది. దీంతో స్టూడెంట్లు రెండు వర్గాలు చీలిపోయి కొట్టుకున్నారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


