కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని కొత్తపల్లి మండలం బావ్పేట ఆసిఫ్నగర్ వద్ద ఇటీవల వీచిన బలమైన ఈదురుగాలులకు ‘భద్రాద్రి గ్రానైట్స్’ పరిశ్రమ షెడ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో భారీ గ్రానైట్ కటింగ్ యంత్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

