కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో మరో సారి సాక్షుల విచారణ జరుగనుంది. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ మాజీ సభ్యులు కె. శివకుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విచారణ కు హాజరుకావాలని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

