కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ గ్రామం రాజీవ్ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. సిద్దిపేటకు వెళ్తున్న స్కూల్ బస్సును వెనక నుంచి బలంగా లారీ ఢీ కొట్టింది. దీంతో బస్సు వెనక భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో తల్లి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
Read Also: పార్లమెంటులో సీఎం రేవంత్ను పలకరించిన రోజా..!
Follow Us On: Instagram

