కలం, కరీంనగర్ బ్యూరో: శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితారానా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉర్దూ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ జాఫర్ జారి, యూనివర్సిటీ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రమాకాంత్, హుస్నాబాద్ జీడీసీ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.భిక్షపతి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికాంత్, హుస్నాబాద్ సంఘమిత్ర కాలేజి లెక్చరర్ బొలిశెట్టి రజిత తోపాటు కరీంనగర్ కు చెందిన వంగల మురళిమోహన్, కొడిమ్యాలకు చెందిన ఏలేటి కవిత, అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజి సెక్రటరీ ఊట్కూరి రవీందర్ రెడ్డి, సిరిపురం ఈశ్వర్ ను ఈసీ మెంబర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

