నల్లగొండలో దారుణం.. బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

కలం, నల్లగొండ : బస్సు ఆపలేదనే కోపంతో ఓ ప్రయాణికుడు చేసిన దాడిలో ఆర్టీసీ డ్రైవర్​ గాయాలపాలయ్యారు. ఈ ఘటన (RTC Driver Injured) నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లగొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఆదివారం నల్లగొండ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళుతుంది. అయితే నల్లగొండ బస్టాండ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఐటీ టవర్ సమీపం చేరుకోగానే మార్గమధ్యలో ఓ ప్రయాణికుడు బస్సును ఆపమని కోరాడు. అయితే డ్రైవర్‌ బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు.

దీంతో సదరు ప్రయాణికుడు ఆగ్రహించి బస్సును బైక్‌పై వెంబడించి ఆపాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామ్ కుమార్‌ను బస్సు నుంచి కిందకు లాగి రోడ్డుపై పడేసి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఊహించని ఈ దాడిలో డ్రైవర్ రామ్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి (RTC Driver Injured). పక్కనే ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా సదరు వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనపై బాధితుడు రామ్ కుమార్ నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడంపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>