కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలోని (Karnataka) హావేరిలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. హావేరి సెంట్రల్ బస్ స్టాండ్లో అతివేగంతో ఆర్టీసీ బస్సు (RTC Bus) ప్లాట్ఫామ్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే బాలుడు చనిపోయాడు. ఈ ప్రమాదంలో బంకాపురానికి చెందిన వాసుదేవ్ (44), హర్ష (6), కావ్యాంజలి (39) అనే మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై హావేరి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా లేక బస్సులో తలెత్తిన సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
-కర్ణాటకలోని హవేరిలో ఆర్టీసీ బస్సు బీభత్సం
-హవేరి సెంట్రల్ బస్ స్టాండ్లో ఒక్కసారిగా ప్లాట్ఫారమ్ మీదకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు
-ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు
Horror at Haveri Bus Stand: 2-Year-Old Boy… pic.twitter.com/KaUdPzaxnr— Kalam Daily (@kalamtelugu) April 1, 2026
Read Also: చండీగఢ్ బీజేపీ ఆఫీసు ఎదుట పేలుడు
Follow Us On: X(Twitter)

