తెలంగాణ మరో బంగ్లాదేశ్‌గా మారుతుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మరో బంగ్లాదేశ్ గా మారుతుంది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి మేడిగడ్డను కూల్చివేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు తిరగబడ్డారన్న కారణంతోనే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారని, రిపేర్లు చేయాలని భావిస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>