కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జైలులో రిమాండ్ ఖైదీ విఠల్ (61) గుండెపోటుతో మృతి చెందాడు. గత నెల 31న రివాల్వర్తో బెదిరించిన ఘటనలో విఠల్కు జైలు శిక్ష పడింది. అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. గురువారం ఉదయం గుండెపోటు (Heart Attack) రావడంతో ఆయనను జైలు సిబ్బంది సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విఠల్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెళ్లి.


