కలం, వెబ్ డెస్క్: కరీంనగర్లోని రాజీవ్ చౌక్ వద్ద శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని (Rajiv Gandhi Statue) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబెర్ పడాల రాహుల్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

