కలం, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్కే (Iran) తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీకి (Mojtaba Khamenei) శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రష్యా మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ సందేశం విడుదల చేశారు.
‘టెహ్రాన్ మా అచంచల మద్దతు కొనసాగుతుంది. ఇరాన్ ప్రజలతో ఐక్యతను ధ్రువీకరిస్తున్నాను. రష్యా ఎప్పటికీ ఇరాన్కు నమ్మకమైన భాగస్వామిగా ఉంటుంది.ప్రస్తుతం సాయుధ దాడులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ నాయకత్వానికి ఎంతో ధైర్యం, నిబద్ధత అవసరం’ అని పుతిన్ పేర్కొన్నారు. మరోవైపు మొజ్తాబా నియామకంపై చైనా సైతం స్పందించింది. మొజ్తాబాకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే, ఆయన్ని లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరికలు చేయడాన్ని వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఇరాన్కు రష్యా (Putin), చైనా మద్దతు తెలపడంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తాబా(56)ను ఆ దేశ అత్యున్నత నేతలు తదుపరి సుప్రీంగా ఎన్నుకొన్న సంగతి తెలిసిందే. అయితే, మొజ్తాబా ఎన్నికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకించారు. అతని నాయకత్వాన్ని అంగీకరించబోమన్నారు. మా మద్దతు లేకపోతే మొజ్తాబా ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమేనని చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ అయితే ఏకంగా చంపేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నా హతం చేస్తామని పేర్కొంది.
Read Also: యుద్ధం కొనసాగాలని చూస్తున్న ట్రంప్..? ప్రపంచానికే ముప్పు..!
Follow Us On: Facebook

