ఢిల్లీ అల్లర్ల కేసు.. షర్జీల్​ ఇమామ్​కు బెయిల్​

కలం, వెబ్​ డెస్క్​: ఢిల్లీ అల్లర్ల కేసు (Delhi Riots Case) నిందితుడు షర్జీల్​ ఇమామ్​కు (Sharjeel Imam) బెయిల్​ లభించింది. సోదరుడి పెళ్లికి హాజరయ్యేందుకు వీలుగా 10 రోజుల మధ్యంతర బెయిల్​ ఇచ్చింది. బెయిల్​పై ఇమామ్​ తరఫు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్​ను సోమవారం ఢిల్లీ కోర్టు విచారించింది. ఆరువారాల పాటు బెయిల్ ఇవ్వాలని నిందితుని తరఫు న్యాయవాదులు కోరగా, అందుకు తిరస్కరించిన న్యాయస్థానం.. ఈ నెల 20 నుంచి 30 వరకు పది రోజుల పాటు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది.

కాగా, సీఏఏ, ఎన్​ఆర్​సీ చట్టాలకు వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో తీవ్రమైన అల్లర్లు (Delhi Riots Case) చెలరేగాయి. ఈ క్రమంలో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై విచారణ జరిపిన దర్యాప్తు బృందాలు.. ఉమర్​ ఖాలీద్​, షర్జీల్​ ఇమామ్​, గుల్ఫిషా ఫాతిమా, మెరాన్​ హైదర్​, షిఫా ఉర్​ రహ్మాన్​, సలీమ్​ ఖాన్​, షాదాబ్​ అహ్మద్​లను అరెస్ట్​ చేసింది. అల్లర్లు చెలరేగేలా ప్రసంగాలు చేయడంతోపాటు ప్రణాళికలు రచించినట్లు వీళ్లపై కేసులు నమోదయ్యాయి. వీళ్లలో ఉమర్​ ఖాలీద్​, షర్జీల్​ ఇమామ్​ మినహా మిగిలినవాళ్లకు ఇప్పటికే బెయిల్​ వచ్చింది. మరోవైపు ఉమర్​ ఖాలీద్​ విడుదలకు ఏకంగా న్యూయార్క్​ మేయర్​ జోహ్రాన్​ మమ్​దానీ సైతం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

Read Also: ఖమ్మం వెలుగుమెట్ల బాధితుల పక్షాన ఆందోళన.. జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>