కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా శివంపేట మండలం గూడూరులో అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది. ఆస్తి వివాదంతో రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. మహమ్మద్ ఖురేషి కుటుంబంపై రెహమాన్ కుటుంబీకుల దాడి, హత్యాయత్నం చేసినట్లు ఆరోపిస్తున్నారు.ఈ దాడిలో తీవ్ర గాయాలతో ఖురేషి కుటుంబీకులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

