కలం, వెబ్డెస్క్: కర్ణాటకలో (Karnataka) ఓ ప్రైవేటు విమానం కూలిపోయింది (Private Aircraft Crashes). ఈ ఘటనలో పైలెట్తో సహా మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం కలబురిగి నుంచి బెళగావికి రెండు సీట్ల చిన్న శిక్షణ విమానం బయలుదేరింది. అయితే, కాసేపటికి విజయపుర జిల్లా బబలేశ్వర్ (Babaleshwar) తాలూకా మంగళూరు గ్రామం వద్ద ఈ ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న పైలెట్తోపాటు మరో వ్యక్తి విమానం కూలడానికి కొద్ది క్షణాల ముందు చాకచక్యంగా కిందకు దూకేశారు.
ఈ ఘటనలో వాళ్లు స్పల్పగాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, నేలను ఢీకొన్ని విమానం మూడు ముక్కలైంది (Private Aircraft Crashes). దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కర్ణాటకలో కుప్పకూలిన శిక్షణ విమానం
కలబురగి నుంచి బెళగావికి వెళ్తుండగా ఘటన
రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన శిక్షణ విమానంగా గుర్తింపు
ప్రమాదంలో పైలట్ కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పైలట్ గౌతమ్ శంకర్ గాయాలు
Redbird Aviation Trainer Aircraft Crash-Lands in Karnataka’s… pic.twitter.com/ihFIVMouLu— Kalam Daily (@kalamtelugu) February 8, 2026
Read Also: పగలు సాఫ్ట్వేర్.. రాత్రి గజదొంగ
Follow Us On : WhatsApp


